పాత బ్యాటరీలతో వీధుల్లో వెలుగునివ్వచ్చట

December 08, 2014 | 12:42 PM | 81 Views
ప్రింట్ కామెంట్

ల్యాప్ టాప్ పాత బ్యాటరీలతో మురికివాడల్లో వెలుగులు పంచవచ్చని ఐబీఎం ఇండియా చేపట్టిన ఓ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయన వివరాలను అమెరికాలోని శాన్ జోస్ లో జరిగిన ఓ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు. పాత బ్యాటరీల్లో ఓ ఎల్ఈడీ బల్బును 4 గంటలకు పైగా వెలిగించేందుకు అవసరమైన శక్తి మిగిలే ఉంటుందని గుర్తించారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల లిథియమ్ అయాన్ బ్యాటరీలను తొలగిస్తున్నారని, వాటిలో అత్యధిక బ్యాటరీలను మరలా వినియోగించుకోవచ్చని ఐబీఎం ఇండియా పేర్కొంది. సోలార్ ప్యానెళ్లను ఈ బ్యాటరీలకు అనుసంధానించడం ద్వారా ఎల్ఈడీ బల్బులను వెలిగించవచ్చని అధ్యయనం వివరిస్తోంది. సాధారణంగా సోలార్ విద్యుత్ వ్యవస్థలో బ్యాటరీనే ఖరీదైన పరికరం అని, పాత ల్యాప్ టాప్ బ్యాటరీలను వినియోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవచ్చని వికాస్ చంద్రన్ అనే శాస్త్రవేత్త తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ