ఢీ కొన్న రెండు రైళ్లు... 100 మందికి గాయాలు

December 08, 2015 | 11:09 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Lokmanya_Tilak_Express_collides_EMU_Palwal_haryana

హర్యానాలోని  మంగళవారం ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పల్వల్ సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్, ఈఎంయూ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈఎంయూ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. దట్టమైన పొగమంచు సిగ్నలింగ్ సరిగ్గా కనపడకపోవటంతోనే ఈ ఘటన జరిగినట్టు ప్రాథమిక సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఘటనలో 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలికి చేరుకుంటున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ