భద్రత కల్పిస్తే నేతాజీని బయటకు తెస్తాడట

December 17, 2014 | 03:50 PM | 25 Views
ప్రింట్ కామెంట్

భారత స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ది ప్రత్యేక స్థానం. అయితే, ఆయన బతికున్నారా? మరణించారా? అన్నదానిపై నేటికీ సస్పెన్స్ నెలకొని ఉంది. ఓ విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని కొందరు చెబుతుంటారు. ఆయన రష్యాలోని ఓ జైల్లో ఉన్నారని ఇటీవలే ఓ కథనం వచ్చింది. తాజాగా, బోస్ బతికే ఉన్నారని, ఆయన భద్రతకు హామీ ఇస్తే కోర్టులో హాజరు పరిచేందుకు సిద్ధమని తమిళనాడులో పీటర్ రమేశ్ కుమార్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బతికున్నారన్న దానికి ఆధారమంటూ ఆయన రమేశ్ కుమార్ ఓ ఫొటోను కోర్టుకు సమర్పించారు. మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపారు. అనుమతిస్తే కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు. దీనిపై విచారణ జరిపిన బెంచ్ వివరణ ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నోటీసులు జారీచేసింది. ఇక, సోమవారం నాటి తదుపరి విచారణ సందర్భంగా, రమేశ్ కుమార్ భారతీయ సుభాష్ సేన రాష్ట్ర అధ్యక్షుడు అళగుమీన తరపున మరో పిటిషన్ వేశారు. 1962లో జరిగిన చైనా యుద్ధంలోనూ, 1964లో నెహ్రూ అంతిమయాత్రలోనూ నేతాజీ పాల్గొన్నారని తాజా పిటిషన్ లో పేర్కొన్నారు. 1963-64 ప్రాంతంలో పశ్చిమబెంగాల్లోని సౌల్ మరి ప్రాంతంలో నేతాజీ సాధువుగా ఉన్నారన్న విషయాన్ని నిఘా విభాగం కూడా గుర్తించిందని వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ