రాజ్యాంగ పితకు దేశవ్యాప్తంగా నివాళులు

December 08, 2014 | 10:31 AM | 28 Views
ప్రింట్ కామెంట్

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు దేశ వ్యాప్తంగా నిర్వహించారు. ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు హాజరై అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అంబేద్కర్ గొప్ప దార్శనికుడు, దేశ భక్తుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని ప్రధాని మోదీ కొనియాడారు. అన్ని రాష్ర్టాలలో ఆయా సీఎంలు, ప్రజా ప్రతినిధులు అంబేద్కర్ వర్థంతి కార్యక్రమంలో పాల్లొన్నారు . ఇక తెలుగు రాష్ర్టాలలో కూడా ఇరు ముఖ్యమంత్రులు రాజ్యాంగపితకు నివాళులర్పించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ