శరద్ పవార్ కు ప్రమాదం

December 05, 2014 | 02:35 PM | 68 Views
ప్రింట్ కామెంట్

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం వాక్ చేస్తుండగా జారి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని ఓ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం, ముంబై తరలించాలని ఆసుపత్రి వైద్యులు సూచించడంతో పవార్ ను ఎయిర్ అంబులెన్స్ లో ముంబయికి తరలించారు. ప్రస్తుతం ఆయన బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పవార్ వెంట సతీమణి ప్రతిభ, కుమార్తె సుప్రియ ఉన్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ