ఏపీలో కురిసిన మోదీ కానుకల వర్షం

October 23, 2015 | 12:15 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-Amaravathi-stepping-stone-prayers-poojas-niharonline

గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ న్యూ రాజధాని అమరావతి నగర శంకుస్థాపన అంగరంగ వైభవంగా జరిగడమే కాదు. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పర్యటనలపై తన అభిప్రాయాలను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ల ద్వారా దేశ ప్రజలతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ చరిత్రాత్మక ఘట్టానికి తెరలేపిందని, ప్రపంచ స్థాయి నగరం నిర్మించేందుకు ముందడుగు వేసిన ప్రభుత్వానికి, ప్రజలకు ఆయన అభినందనలని తెలిపారు. ఆపై వరుస ట్వీట్లు చేస్తూ, అమరావతికి యమునా నీటిని, పార్లమెంటులోని మట్టిని తీసుకెళ్లి అందించానని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు అక్కడ కొన్ని తెలుగు మాటలు మాట్లాడానని తెలిపారు. అమరావతి అభివృద్ధికి సహకరిస్తానని చెప్పినట్టు మోదీ పేర్కొన్నారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుని ప్రార్థనలు జరిపానని, అక్కడి ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ ను ప్రారంభించానని దీంతో యాత్రికులకు, ప్రయాణికులకు మరింత సౌకర్యం దగ్గర కానుందని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త సంస్థ శ్రీ వెంకటేశ్వరా మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్ కు శంకుస్థాపన చేసినట్టు కూడా మోదీ వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ