ఎంపీలారా! ప్రజలతో కలిసి పండగచేస్కోండి

March 03, 2015 | 04:06 PM | 64 Views
ప్రింట్ కామెంట్
modi_mp_holi_niharonline

భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు హుషారుగా హోలీ పండగను ప్రజలతో కలిసి జరుపుకోవాలని దేశ ప్రధాని మోదీ కోరారు. పనిలోపనిగా 125 కోట్ల మంది భారతీయులకు పార్లమెంటు ముందుకు వచ్చిన బడ్జెట్, దానిలోని ముఖ్య విషయాల గురించి అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. పార్టీ సమావేశంలో భాగంగా ఎంపీలతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బడ్జెట్ లో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మోదీ వారికి సూచించినట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ