ఉక్కుమనిషి కి ఐక్యతాపరుగుతో నివాళి

October 31, 2015 | 10:31 AM | 2 Views
ప్రింట్ కామెంట్
modi_pay_tributes_to_sardar_patel_niharonline

భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ పథ్ లో యూనిటీ ఫర్ రన్ ప్రారంభమైంది. ఈ ర్యాలీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు సర్దార్ పటేల్ కు ఆయన ఘనంగా ట్విట్టర్లో నివాళులు అర్పించారు. దేశ తొలి హోంమంత్రిగా పరాయిపాలనలో ఉన్న సంస్థాలను స్వతంత్ర్య భారతావనిలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన కృషి చిరస్మరణీయమైందని కొనియాడారు. మొక్కవొని దీక్షతో ఆయన దేశానికి చేసిన సేవలు అమోఘమని పేర్కొన్నారు. ఇక ఐక్యతాపరుగు  కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు టీ షర్ట్ తో హాజరై ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తదతర ప్రముఖులు కూడా హాజరయ్యారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ