భూమా మీడియాతో చేసింది జోకా?

March 09, 2016 | 11:15 AM | 2 Views
ప్రింట్ కామెంట్
bhooma-nagi-reddy-about-ministry-niharonline

ప్రతిపక్ష వైసీపీకి గట్టి దెబ్బే కొడుతూ  టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. అన్న ఇలా చేస్తాడు అని కలలో కూడా ఊహించలేదు అని జగన్ సైతం విస్తూ పోయాడంటే అర్థం చేసుకోవచ్చు భూమా ఇచ్చిన షాక్ ఏరేంజో.  ప్రతిపక్షంలో కీలక నేతగానే కాక, ఏపీ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ గా ఆయన ఉన్న సంగతి తెలసిందే. పీఏసీ పదవికి అయితే రాజీనామా చేశారు కానీ, పార్టీ కట్టబెట్టిన ఎమ్మెల్యే పదవికి మాత్రం ఆయన రాజీనామా చేయకుండానే సైకిల్ ఎక్కేశారు. దీంతో ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించడమే తరువాయి అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.

                          ఈ క్రమంలో మంగళవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరైన భూమాను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ‘పార్టీ మారారు. మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు చేపడుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. దీనికి ఆయనా అంతే వేగంగా స్పందించారు. ‘‘ఆ ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నాను. కానీ, దానికి నా వద్ద సమాధానం లేదు’’ అంటూ బదులిచ్చారు. మరి కర్నూలు నుంచి ఇంకెవరైనా వైసీపీ ఎమ్మెల్యేలు అధికారపక్షంలోకి చేరుతారా? అన్న ప్రశ్నకు ‘‘మీరు జాబితా ఇస్తే, వారిని పార్టీలో చేర్చేందుకు యత్నిస్తా’’ అంటూ ఆయన చమత్కరించారు.

పార్టీ మారే క్రమంలో కేబినెట్ హోదా, పలు కేసుల నుంచి ఉపశమనం తదితర తాయిలాలతోనే భూమా నాగిరెడ్డి తన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ‘సైకిల్’ ఎక్కేశారన్న ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ