ఎన్టీఆర్ దేవుడు.. హరికృష్ణ గురువు... మరి జగనో?

April 02, 2016 | 11:31 AM | 1 Views
ప్రింట్ కామెంట్
kodali-nani-harikrishna-niharonline

ఏపీ రాజకీయాల్లో కాసేపటి క్రితం చిన్నపాటి కలకలం రేగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బావ, పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ, వైసీపీ నేత కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)లు ఒకే కారులో వచ్చి బందరు రోడ్డులో దిగారు. అయితే అంతలోనే ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వారసులైన హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లకు అత్యంత సన్నిహితుడు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు నాని. మరోవైపు అసంతృప్తిగా ఉన్నా, హరికృష్ణ టీడీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో వీరిద్దరు కలిసి ఓ కార్యక్రమానికి హాజరవుకావటంతో ఏం జరుగుతుందోనని కాసేపు గందరగోళం నెలకొంది. విజయవాడలోని బందరు రోడ్డులో శనివారం ఎన్టీఆర్ వెటర్నిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికే వీరిద్దరు కలిసి హాజరయ్యారు.

                                                 అయితే మీడియా ఎదురు పడటంతో కొడాలి నాని వివరణ ఇచ్చుకున్నారు. తన ఆరాధ్య దైవం దివంగత నందమూరి తారకరామారావు పేరిట ఆసుపత్రి ప్రారంభోత్సవమని తెలిసిన కారణంగానే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆయన పేర్కొన్నారు. అంతేకాక ఈ ఆసుపత్రికి తన గురువు నందమూరి హరికృష్ణ నిధులిచ్చారని, అందుకే ఆయనతో కలిసి వచ్చానని తెలిపారు. ఎన్ని పార్టీలు మారినా, తనకు హరికృష్ణే గురువని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే కలిసి నడుస్తానని ఆయన ప్రకటించారు. అభిమానానికి, సిద్ధాంతాలకు ముడిపెట్టోద్దని మీడియాకు నాని విజ్నప్తి చేశాడు. తన రాజకీయ జీవితమంతా జగన్ తోనే సాగుతుందని కూడా కొడాలి నాని పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ