టీడీపీ ఎమ్మెల్యే కటీఫ్ ని కన్ఫర్మ్ చేశాడు

February 10, 2016 | 02:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
r-krishnaiah-confirmed-no-relations-with-TDP-niharonline

తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థిగా నిలిచి, టీడీపీ తరపున ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే కాపులను బీసీల్లో చేర్చాలని, కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లతో మొన్న తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ‘కాపు గర్జన’, ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష, ఏపీ ప్రభుత్వం రాజీ మంత్రం నేపథ్యంలో బీసీలకు కాపులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. కాపులకు వేరుగా రిజర్వేషన్లు ఇచ్చుకుంటే ఫరవా లేదని, అయితే వారిని బీసీల్లో చేరిస్తే మాత్రం సహించేది లేదని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.

మరోవైపు కాపు రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలసిందే. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి, పార్టీ అధినేత నిర్ణయాన్ని ఎలా వ్యతిరేకిస్తారంటూ మీడియా కృష్ణయ్యను ప్రశ్నించింది. ఇందుకు ఆయన ఘాటుగా స్పందించారు. ఇప్పటి నుంచి టీడీపీతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా బీసీనీ సీఎంను చేస్తానంటేనే ఆ పార్టీలో చేరానని ఆయన చెప్పుకోచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేగా కంటే బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తాను ఏ ఒక్క పార్టీ జెండాను మోసేందుకు సిద్ధంగా లేనని ఆయన ప్రకటించారు. మొన్న ప్రెస్ మీట్ లో చంద్రబాబు ఆర్.కృష్ణయ్యపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కృష్ణయ్య చేసిన ప్రకటనతో టీడీపీతో తెగదెంపులు చేసుకున్నట్లేనని స్పష్టమైంది. మరి టీడీపీ తరపున కలిగిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారో చెయ్యరో మాత్రం ఆయన చెప్పలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ