పొన్నం ప్రశ్న: బాలయ్య ఓటు చెల్లదా?

February 04, 2016 | 03:11 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ponnam-on-balayya-Vote in GHMC Election niharonline

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. తెలంగాణ పరిధిలోకి వచ్చే గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య ఓటు ఎలా వేస్తారన్నదే ఆయనపై కంప్లైయింట్. ఇంతకీ ఫిర్యాదు చేసింది ఎవరో కాదు టీకాంగ్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లో ఓటరుగా ఉన్న బాలయ్య జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే రెండు రోజుల పాటు సైలెంట్ గా ఉన్న పొన్నం తాజాగా నేటి ఉదయం ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తున్న అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇటువంటి ఓట్లు చాలానే నమోదయ్యాయి. మరీ వాటి సంగతి ఏంటన్నది బహుశా పొన్నం గుర్తించట్లేదేమో!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ