ఛాంపియన్స్ లీగ్ టీ20... ఇక లేదు

July 15, 2015 | 03:21 PM | 10 Views
ప్రింట్ కామెంట్
champion_league_cancelled_niharonline

కీలక జట్లపై నిషేధం విధించిన మరో రోజు తర్వాత బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ లీగ్ టీ20ని పూర్తిగా రద్దుచేస్తూ బుధవారం నిర్ణయం ప్రకటించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని టోర్నీ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగాల్సిన టోర్నీ కూడా అర్థాంతరంగానే ఆగిపోయినట్లైంది. 2009లో ఛాంపియన్స్ లీగ్ లాంచ్ అయింది. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ సౌత్ ఆఫ్రికాలు ఛాంపియన్స్ లీగ్ కు ప్రాణం పోశాయి. టోర్నీ నిర్వహణ కష్టమైనందునే బీసీసీఐ ఈ టోర్నీని రద్దుచేసింది. ఛాంపియన్స్ లీగ్ స్థానంలో ఐపీఎల్ లోని టాప్-4 జట్లతో మినీ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ