చివరి టీ-20 ఓటమితో ముగించినప్పటికీ జింబాబ్వే పర్యటన విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ ప్రస్తుతం శ్రీలంక టూర్పై దృష్టి కేంద్రీకరించింది. ఈ పర్యటనకు పూర్తిస్థాయి టీమ్ను పంపించాలని భావించిన బోర్డు గురువారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో సీనియర్ హర్భజన్ సింగ్ కు, మరో స్పిన్ బౌలర్ అమిత్ మిశ్రాలకు చోటుదక్కడం విశేషం. లంక టూర్ జట్టు ఎంపిక కోసం సందీప్ పాటిల్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం సమావేశం టీంను ప్రకటించింది. ఆగస్టు 12 నుంచి శ్రీలంకతో భారత్ మూడు టెస్ట్ లు ఆడనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు 14 మందిని ఎంపిక చేసింది. జట్టులో విరాట్ కోహ్లీ(కెప్టెన్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), ధావన్, మురళి విజయ్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, అశ్విన్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, హర్భజన్ సింగ్, వరుణ్ అరోన్, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్ ఉన్నారు.