ఐపీఎల్-2016 కొత్త జట్లు ఖరారు

December 08, 2015 | 04:43 PM | 1 Views
ప్రింట్ కామెంట్
ipl_2016_9_season_new_teams_niharonline

ఐపీఎల్ 2016 జట్లను ఖరారు చేసిన బీసీసీఐ పాలక మండలి, వచ్చే ఏడాది నిర్వహించే టోర్నీని ప్రకటించింది. 2016 ఏప్రిల్ 9 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుందని వెల్లడించింది. ఇక ఈ 9వ సీజన్ ఆట మే 29 దాకా ఈ టోర్నీ కొనసాగనుంది. కాగా, భారత్ లో ఐపీఎల్ సూపర్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన అవినీతితో ప్రతిష్ఠ కోల్పోయిన జట్లను తొలగించిన తరువాత జరుగుతున్న ఐపీఎల్ ఎంత ఆదరణకు నోచుకుంటుందనేది క్రీడావిశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్న.

                     ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రెండు కొత్త జట్లు వచ్చాయి. వచ్చే రెండు సీజన్లలో పుణె, రాజ్‑కోట్ ఫ్రాంచైజీలు ఆడుతాయని మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. బెట్టింగ్ ఉదంతంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో ఈ రెండు జట్లను తీసుకున్నారు. పుణె టీమ్‑ను 16 కోట్ల రూపాయలకు న్యూ రైజింగ్ (సంజీవ్ గొయెంకా) సొంతం చేసుకోగా, రాజ్‑కోట్ జట్టును 10 కోట్ల రూపాయలకు ఇంటెక్స్‑ దక్కించుకుంది.  చెన్నై, రాజస్థాన్ జట్లలోని టాప్-5 ఆటగాళ్లను.. పుణె, రాజ్‑కోట్ ఎంపిక చేసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 6న బెంగళూరులో ఆటగాళ్ల వేలం వేయనున్నారు. పూర్తి షెడ్యూల్ ను ఈ నెల 15న విడుదల చేస్తారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ