వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ టోర్నీ భారత్ లోనే జరగనుంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియాను ఈ చిట్టి పొట్టి ఫార్మాట్ లో బలమైన జట్టుగానే అంతా భావిస్తారు కూడా. అదే ఇదే భావవతో ఏకీభవిస్తున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్. బుధవారం హైదరాబాదు వచ్చిన ఆయన సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టీమిండియా ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
వచ్చే టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా గెలిచి తీరుతుందని కూడా ఆయన ప్రకటించారు. ‘‘భారత్ లో టీ20కి మంచి ఆదరణ ఉంది. ఈ ఫార్మాట్ లో మన జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇకపై కూడా బాగా రాణిస్తుందని నా నమ్మకం. భారత్ 2016 ప్రపంచ కప్ నెగ్గుతుందేమో ఎవరికి తెలుసు?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.