మొదటి ఇన్నింగ్స్ ముగించేశారు

November 05, 2015 | 03:58 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Mohali Test India all out for 201 against South Africa

సఫారీలతో మొహాలీలో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత తొలి ఇన్నింగ్స్ పోరు 201 పరుగుల వద్ద ముగిసింది. కేవలం 68 ఓవర్లకే భారత ఆటగాళ్లు చాపచుట్టేశారు. ఆరుగురు ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరును చేరుకోలేకపోవడం, ముగ్గురు డక్కౌట్లు కావడం, కెప్టెన్ కోహ్లీ నిరుత్సాహకర ప్రదర్శన భారత్ ను కోలుకోలేని దెబ్బ తీశాయి. మురళీ విజయ్ 75 పరుగులు, రవీంద్ర జడేజా 38, పుజారా 31 పరుగులు మినహా మిగతాఎవరూ రాణించలేకపోయారు. అశ్విన్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎల్గర్ 4 వికెట్లతో రాణించగా, ఫిలాండర్, తాహిర్ లు చెరో రెండు వికెట్లు తీశారు. ఇక తొలిఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 5 ఓవర్లలో 7 పరుగులకు వికెట్లు ఏమీ కోల్పోలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ