గెలుపు మదం: సందు దొరికిందని రెచ్చిపోతున్నాడు

June 26, 2015 | 06:21 PM | 3 Views
ప్రింట్ కామెంట్
mustafa_kamal_bangladesh_srinivasan_niharonline

బంగ్లాదేశ్ కు చెందిన ఐసీసీ మాజీ అధ్యక్షుడు ముస్తఫా కమల్. వరల్డ్ కప్ వివాదాన్ని తిరగదోడుతున్నారు. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ క్వార్టర్ మ్యాచ్ వివాదాస్పదం కావటం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అంపైరింగ్ నిర్ణయాల వల్లే బంగ్లా ఓడిపోయిందని ఆయన అప్పుడు ఆరోపించారు. దీనికి నిరసనగా ఆయన రాజీనామా కూడా చేశారు. తాజాగా, బంగ్లాదేశ్ భారత్ పై సిరీస్ నెగ్గటంతో ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ కు భారత్ పై గెలిచే సత్తా ఉందని ఈ సిరీస్ నిరూపించిందని అంటున్నాడు. వరల్డ్ కప్ లో కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయాలకే ఓడిపోవాల్సి వచ్చిందని మళ్లీ వ్యాఖ్యానించారు. అంతేకాదు వరల్డ్ కప్ ఓటమిలో భారత్ విజయం వెనుక మాజీ చీఫ్ శ్రీనివాసన్ హస్తం ఉన్నట్లు ఆయన ఆరోపిస్తున్నారు. మ్యాచ్ ప్రభావితం చెయ్యగల వ్యక్తి శ్రీనివాసన్. మెల్ బోర్న్ మ్యాచ్ లో కూడా ఆయన తన ప్రభావం చూపి విజయం భారత్ కు అనుకూలంగా వచ్చేలా చేశారు అని కమల్ చెబుతున్నారు. ఎంత సిరీస్ గెలిచిందన్న సందు దొరికితే ఇలా కమల్ రెచ్చిపోవటం కామెడీగా ఉంది. మరి భారత్ తరపున ప్రతిదాడి ఎలా ఉండబోతుందనేది చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ