చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు 3 రోజు ఆట ఇంకా ప్రారంభం కాలేదు. సోమవారం ఆటకు వర్షం ఆటంకం కలిగిస్తూ వస్తుంది. బెంగళూరులో భారీ వర్షం కురుస్తుండటంతో మైదానం మొత్తం చిత్తడి చిత్తడిగా మారిపోయింది.
ఆదివారం కూడా వర్షం కురుస్తూనే ఉండటంతో ఆట ఒక్క బంతి కూడా పడకుండా రద్దయ్యింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా గత కొన్ని రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ తొలి రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 214 పరుగులకు ఆలౌట్ కాగా, టీమిండియా 80/0 స్కోరు చేసింది. ఫలితం తేలుతుందనుకున్న ఈ మ్యాచ్ వర్షం పాలు కావటంతో భారత అభిమానులంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.