లైవ్ షోలో తిట్టేసుకున్న పాక్ మాజీలు

December 30, 2015 | 11:56 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Ramiz_Raja_Mohammad_Yousaf_confronts_in_liveshow_niharonline

మైదానంలోనే కాదు బయట కూడా పాక్ క్రికెటర్ లు తమ ‘శైలి’ని వదలలేదు. అంతర్గతంగా వారిలో ఉన్న వైరాలను ఓ టీవీషోలో బయటపెట్టేసుకున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు రమీజ్ రాజా, మహమ్మద్ యూసుఫ్ ఓ టీవీషోలో అదీ కూడా లైవ్ లోనే తిట్టేసుకున్నారు. పాకిస్థాన్, న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా వీరిద్దరూ మ్యాచ్ గురించి విశ్లేషిస్తున్నారు. అకస్మాత్తుగా రమీజ్ రాజా మాట్లాడుతూ... ఎవరైతే గడ్డం పెంచుకుంటారో వారు అబద్ధాలకు దూరంగా ఉండాలని యూసఫ్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా పేర్కొన్నాడు. దీంతో అగ్గి రాజుకుంది. వెంటనే యూసఫ్ మాట్లాడుతూ, 'సిగ్గుమాలిన పనులు చేసేవారే నీలా అర్థం లేకుండా మాట్లాడుతారు' అనేశాడు.

                    'నీకు క్రికెట్ ఆడే సామర్థ్యమే లేదు, మాటకారితనంతో మాయ చేస్తున్నావు...నీకు గడ్డం పెంచే అర్హత లేదు. నువ్వు పాకిస్థాన్ క్రికెట్ కు చేసిందేమీ లేదు. 57 టెస్టుల్లో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేశావు. అసలు ప్రముఖ క్రికెటర్ వి ఎలా అయ్యావో చూడాలని ఉంది, నువ్వు క్రికెటర్ వి కాదు, ఇంగ్లీష్ టీచర్ వి' అంటూ నిప్పులు చెరిగాడు యూసఫ్.                     దానికి సమాధానంగా రమీజ్ రాజా మాట్లాడుతూ, 'నువ్వేం మాట్లాడినా ఫర్వాలేదు. పాకిస్థాన్ క్రికెట్ లో చీడ పురుగు మాదిరిగా తయారయ్యావు' అంటూ మరోసారి చురక అంటించాడు. దీనికి సమాధానంగా 'అవును, నాకు క్రికెట్ సర్వస్వం, అది తప్ప ఇంకోటి తెలీదు, నీకు అదే తెలీదు' అంటూ మండిపడ్డాడు. దీంతో షాక్ తినడం యాంకర్ వంతు అయ్యింది. చివరికి ఎలాగోలా సర్ది చెప్పి విశ్లేషణను ముగించాడా యాంకర్. ప్రస్తుతం ఈ టాపిక్ అంతర్జాతీయ క్రికెట్ లో దుమారం రేపుతోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ