రోహిత్, కోహ్లీ విజృంభణ

January 12, 2016 | 11:29 AM | 1 Views
ప్రింట్ కామెంట్
Rohit Kohli frustrate Australia in first ODI

 పెర్త్ లో జరుగుతున్న తొలి వన్డే పోరులో ఇండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు రాణించారు. ఈ క్రమంలో రోహిత్ తన సెంచరీని, కోహ్లీ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. మొత్తం 131 బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ 7 ఫోర్లు, 3 సిక్స్ ల సాయంతో 113 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ కెరీర్ లో రోహిత్ కు ఇది 9వ సెంచరీ. మరో ఎండ్ లో నిలకడగా ఆడుతున్న విరాట్ కోహ్లీ 82 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 76 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 39 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 204 పరుగులు. భారత ఆటగాళ్ల వికెట్లను తీసేందుకు ఆస్ట్రేలియా చేస్తున్న ప్రయోగాలు ఫలించడం లేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ