మొబైల్ గేమ్ మార్కెట్లోకి మరో క్రికెటర్

December 19, 2015 | 02:42 PM | 2 Views
ప్రింట్ కామెంట్
rohit_sharma-launches-new-cricket-comic-series-niharonline

ఈ మధ్య క్రికెటర్లు అదనంగా మరో వ్యాపకాన్ని అలవాటు చేసేసుకుంటున్నారు. ఓవైపు అకాడమీలు నడిపిస్తూనే, మరోవైపు రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా అన్నింట్లో వేళ్లు దూర్చేస్తున్నారు. అదే కోవలో చేరాడు తాజా పెళ్లి కొడుకు, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ. త్వరలో మొబైల్ గేమ్ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాడు. ‘హైపర్స్ టైగర్స్’ పేరిట తను ఓ కామిక్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న అందుబాటులోకి వచ్చే ఈ సూపర్ హీరో సిరీస్ కోసం గ్రాఫిక్ ఇండియా, ఐఎస్‌ఎం కామిక్స్‌తో రోహిత్ శర్మ భాగస్వామ్యం కానున్నాడు. ఈ గేమ్‌ను రోహిత్ శర్మ ఫేస్‌బుక్ పేజి, గ్రాఫిక్ పాప్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వినియోగదారులు ఉచితంగా ఆడవచ్చు.‘భారత్‌లో కొత్త సూపర్ హీరోస్‌ను తయారుచేస్తున్న గ్రాఫిక్ ఇండియాకు నేను పెద్ద అభిమానిని. దేశంలో తొలిసారిగా క్రికెట్ ఆధారిత సూపర్ హీరో కామిక్ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు నేను వారితో భాగస్వామ్యం అవుతున్నాను. ఇది 2077 కాలానికి సంబంధించి యాక్షన్‌తో పాటు సాహసోపేతంగా సాగుతుంది’ అని రోహిత్ అన్నాడు. ఇప్పటికే కోహ్లి ‘విరాట్ క్రికెట్ చాలెంజ్’ పేరిట ఓ గేమ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ