అమెరికన్ వాసులకు ఇష్టమైన ఆట ఏదంటే టక్కున చెప్పే పేరు బేస్ బాల్. గరిటె లాంటి బ్యాట్ తో బంతిని బలంగా విసురుతుంటే... టపీ మని కొట్టగానే ఆటగాడు పరిగెత్తటం, ప్రేక్షకులు ఎంజాయ్ చెయ్యటం అప్పుడప్పుడూ మనమూ టీవీల్లో చూస్తాం. అయితే ఎన్ని అంశాల్లో పోటీపడుతున్న అమెరికన్లు ఇప్పటిదాకా జోలికెళ్లని ఆట ఏదంటే... అది ఒక్క క్రికెటే. అయితే వాళ్లు క్రికెట్ ఆడితే చూడాలని కొరుకుంటున్నాడట మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ దిగ్గజం ఆసీస్ మాజీ దిగ్గజం షేన్వార్న్ టీంతో అక్కడ మూడు టీ 20 వన్డేల్లో ఆడేందుకు సిద్ధమయ్యారు.
ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ... అమెరికన్లకి బేస్ బాల్ అంటే ప్రాణం. కానీ, వారు క్రికెట్ ను చూస్తే అస్సులు వదలరు. తప్పకుండా ఇష్టపడతారు. వారు ఆడితే చూసి ముచ్చట తీర్చుకుంటాను అని వ్యాఖ్యానించాడు. నవంబర్ ఏడున బిగ్ లీగ్ బేస్బాల్ స్టేడియం వేదిక(సిటీఫీల్డ్) గా, 11వ తేదీన మినూట్ మెయిడ్ పార్క్( హోస్టన్)లోను, నవంబర్ 14న డాడ్గర్ స్టేడియం (లాస్ ఎంజెల్స్) వేదికగా టీ 20లు జరుగు తాయి.సచిన్, వార్న్ లతో పాటు పాకిస్తాన్కు చెందిన వసీమ్ అక్రమ్, వెస్టీండీస్కు చెందిన బ్రియాన్ లారా దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వెస్ కలిస్, ఇంగ్లండ్కు చెందిన మైకేల్ వా, శ్రీలంక నుంచి మహేల జయవర్ధన కూడా ఈ మ్యాచ్ ల్లో పాలుపంచుకోనున్నారు. మరీ క్రికెట్ దిగ్గజ పిలుపునకు స్పందిస్తారా?