మొన్నా టీమిండియాను కోలుకోలేని దెబ్బ తీశారు. అదే ఊపుతో ఇప్పుడు మరో స్ట్రాంగ్ టీం దక్షిణాఫ్రికాను చిత్తుచేశారు. వరుస విజయాలతో బంగ్లాదేశ్ సత్తా చాటుతోంది. ఆదివారం మిర్పూర్ లో దక్షిణాఫ్రికా తో జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో సౌతాఫ్రికాపై గెలిచిన బంగ్లాదేశ్, రెండో వన్డేలోనూ చిత్తుచేసి సీరిస్ ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు బంగ్లా బౌలర్ల దెబ్బకు 162 పరుగులకే చాప చుట్టేశారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లా సౌమ్య సర్కార్ (88), మహ్మదుల్లా (50) అర్థ శతకాలతో రాణించారు. దీంతో కేవలం 27.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సఫారీలపై విజయంతోపాటు సిరీస్ ను గెలుచుకుంది. బంగ్లా ఇంకా మునుముందు ఇంకెన్నీ వండర్స్ క్రియేట్ చెయ్యబోతుందో...