కెప్టెన్ ధోనీ ఇకపై కూల్ గా ఉండలేడని భారత స్పిన్ లెజెండ్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడుతున్నారు. కెరీర్లో క్లిష్టదశను అధిగమించేందుకు మహీకి ఇప్పుడు ఒక్కటే మార్గమట. అదే యోగా చేయటం. ‘ధోనీ తొలిసారి వైరాగ్యంగా మాట్లాడడం చూస్తున్నా. దీన్ని బట్టి అతను ఇకపై కెప్టెన్ కూల్ గా ఉండలేడని స్పష్టమైంది. మహీ కలత చెందినట్టు కనిపిస్తున్నాడు. బంగ్లాతో సిరీస్ సమష్టి వైఫల్యమ’ని చెప్పాడు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ను ధోనీ ఢీకొనడాన్ని బేదీ తప్పుపట్టాడు. ‘అలసట వల్లే ధోనీ సహనం కోల్పోయినట్టు తెలుస్తోంది. అతనిప్పుడు యోగా చేయాల్సిన అవసరం ఉంద’ని బేడీ ఓ టీవీ చానెల్ కిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.