భారీ వర్షం, బురదతో బతికిపోయారు

October 09, 2015 | 10:05 AM | 1 Views
ప్రింట్ కామెంట్
India-Vs-South-Africa-3rd-T20-Called-off-niharonline

పరువు కోసం పోరాడాల్సిన మ్యాచ్, మరోవైపు క్లీన్ స్వీప్ కోసం సఫారీల ఆరాటం రెండూ వ్యర్థమయిపోయాయి.  కష్టపడకుండానే మూడో టీ 20 మ్యాచ్ రద్దయిపోయింది. మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ కు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. ఫ్రెండ్లీ కప్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో గురువారం సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సౌతాఫ్రికా-భారత్ మధ్య ప్రారంభం కావాల్సిన చివరి టీట్వంటీ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

మధ్యాహ్నం కోల్ కతాలో కురిసిన భారీ వర్షానికి ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. క్రీజుపై కవర్లు కప్పి ఉంచడంతో పిచ్ బాగానే ఉన్నప్పటికీ స్టేడియంలోని బౌండరీ లైన్ వద్ద చిత్తడిగా తయారైంది. యంత్రాల సాయంతో చిత్తడిని తొలగించేందుకు గ్రౌండ్స్ మన్ శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మూడుసార్లు స్టేడియంను పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచ్ ఆడేందుకు అనువుగా లేదని పేర్కొంటూ రద్దు చేశారు. దీంతో 2-0 తేడాతో మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ట్రోఫీని సొంతం చేసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ