శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో భారత్ 130 పరుగుల ఆధిక్యంతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది. శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు సెంచరీలు చేశారు. ధావన్ 271 బంతులు ఎదుర్కొని 134 పరుగులు చేశాడు. 191 బంతులను ఆడిన కెప్టెన్ కోహ్లీ 103 పరుగులు చేసి అవుటయ్యాడు. శ్రీలంకతో టెస్టులో మూడో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం 227 పరుగులు విరాట్ కోహ్లీ , ధావన్ నెలకొల్పారు. గతంలో మూడో వికెట్కు సచిన్-కాంబ్లీ జోడి చేసిన అత్యధిక పరుగులు 162. ప్రస్తుతం భారత్ 6 వికెట్లకు 302 పరుగులు చేసింది. ఇప్పటికే 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. సాహా, హర్భజన్ సింగ్లు క్రీజులో ఉన్నారు.