విజయానికి మరో 5 వికెట్ల దూరంలో భారత్ ఉంది. మూడో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇప్పటికీ ఐదు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ ఆంగ్లో మాథ్యూస్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరు చేస్తున్నాడు. 67/3 ఓవర్ నైట్ స్కోర్ తో మంగళవారం ఆట ప్రారంభించిన లంక మరో రెండు వికెట్లను కోల్పోయింది. ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో పుజారా కు క్యాచ్ ఇచ్చి సిల్వ(27) నిష్క్రమించగా, తిరిమన్నె(12) అశ్విన్ బౌలింగ్ లో రాహుల్ కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో కెప్టెన్ మాథ్యూస్ (55), పెరెరా (6) ఉన్నారు. వరుణుడు కాచుకుని ఉండటంతో భారత్ బౌలర్లు ఎంత త్వరగా వికెట్లు తీస్తే అంతమంచిది. లంక ప్రస్తుత స్కోర్ 127/5.