పుజారా హాఫ్ సెంచరీ... కష్టపడుతున్న భారత్

August 29, 2015 | 12:43 PM | 1 Views
ప్రింట్ కామెంట్
chateshwara_pujara_second_day_third_test_niharonline.jpg

శ్రీలంకతో కీలకమైన ఆఖరి టెస్ట్ లో భారత్ కాస్త కష్టపడుతుంది. మొదటి రోజు ఆట వర్షార్పణం కావటం తెలిసిందే. ఇక శనివారం రెండో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోర్ 50/2 ప్రారంభించింది. లోకేష్ రెండు పరుగులకు, రహనే 8 పరుగులకు అవుటయిన విషయం తెలిసిందే. ఇక రెండో రోజు ఆట పప్రారంభమైన కాసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ ని లంక కెప్టెన్ మాథ్యూస్ అవుట్ చేశారు. మరో బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ (26) ను దమ్మిక అవుట్ చేశాడు. దీనితో లంచ్ సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా 55 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ రెండు, ప్రదీప్, మాథ్యూస్ లు తలా ఒక వికెట్ తీశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ