బ్యాటింగ్ చేస్తున్న భారత్... విజయ్ అవుట్

December 03, 2015 | 10:58 AM | 1 Views
ప్రింట్ కామెంట్
india_won_toss_in_fourth_test_niharonline

దక్షిణాఫ్రికా, భారత్ మధ్య ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా చివరి మ్యాచ్ నాలుగో టెస్టు గురువారం ఉదయం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని పర్యాటక జట్టును ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. భారత ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ లు టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. మరి నెమ్మదిగా ఆట కొనసాగుతుంది. ప్రస్తుతానికి భారత్ స్కోర్ 16 ఓవర్లకు ఒక వికెట్ నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది. విజయ్ 12ల వద్ద అవుటయ్యాడు. ఇక మరో ఓపెనర్ ధవన్ 16 పరుగులతో ఆడుతున్నాడు.  

                     నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే మూడు టెస్టులు ముగిశాయి. టీమిండియా 2-0 ఆధిక్యంతో పైచేయి సాధించింది. ప్రధానంగా స్పిన్ బౌలింగ్ ను ఆయుధంగా ప్రయోగించిన కోహ్లీ, వరుస విజయాలను నమోదు చేశారు. నేటి మ్యాచ్ తన సొంత మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లోనూ అతడు స్పిన్ తోనే సఫారీలను ముప్పు తిప్పలు పెట్టేందుకు పక్కాగా ప్లాన్ చేసినట్లే కనిపిస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ