కోలంబో లోని పి సారా ఓవల్ స్టేడియంలో భారత్ శ్రీలంక మధ్య రెండో టెస్ట్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ప్రారంభించింది. కాగా ఓపెనర్ మురళీ విజయ్ డకౌట్ అయి నిరాశపరిచాడు. తొలి ఓవర్ లో నాలుగో బంతికే దమ్మిక బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యూ గా వెనుదిరిగాడు. ఇక ప్రస్తుతం భారత్ స్కోర్ 3 ఓవర్లకు 12 పరుగులు చేసింది. ముందుగా జట్టులో మూడు మార్పులు జరిగాయి. శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, వరుణ్ అరోన్ ప్లేస్ ల్లో మురళీ విజయ్, స్టువర్ట్ బిన్నీ, ఉమేష్ యాదవ్ లను తీసుకున్నారు. మరోవైపు శ్రీలంకలో నువాన్ ప్రదీప్ స్థానంలో దుష్మంత చామర వచ్చాడు. ఆకాశం మేఘావృతం కావడం కొంచెం కలవర పరుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం శ్రీలంక ఛాంపియన్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర తన కెరీర్ కు వీడ్కోలు పలకనున్నాడు.