రెండో టెస్ట్ లో లంక పోరాడుతుంది. శుక్రవారం జరుగుతున్న రెండో రోజు ఆటలో లంకేయులు దాటిగా ఆడుతున్నారు. ఓపెనర్ కరుణరత్నే ఒక్క పరుగుకే అవుట్ కాగా, కెప్టెన్ సంగక్కర 32 పరుగులకు, కౌశల్ సిల్వ 51 పరుగులకు అవుటయాయారు. ఉమేష్, మిశ్రా, అశ్విన్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 140 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అంతకు ముందు 319 పరుగలతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 393 పరుగులకు అలౌట్ అయ్యింది. రోహిత్ శర్మ 79 పరుగులు చేయగా, సాహా 56 పరుగులు చేశాడు. హెరాత్ నాలుగు వికెట్లు తీశాడు.