డే 3: టీమిండియాకు ఆధిక్యం... 306 కు లంక ఆలౌట్

August 22, 2015 | 05:32 PM | 1 Views
ప్రింట్ కామెంట్
srilanka_india_3rd_day_niharonline

లంకతో రెండో టెస్ట్ లో భారత్ పట్టుబిగిస్తున్నట్లు కనిపిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 306 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ మాథ్యూస్ (102) సెంచరీతో, తిరుమన్నె (62) తో రాణించారు. అమిత్ మిశ్రా 4 వికెట్లు, ఇషాంత్, అశ్విన్ చెరో రెండు వికెట్లు సాధించారు.

                    ఇక రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ భారత్ ఒక వికెట్ నష్టపోయి 70 పరుగులు చేసింది. సెంచరీ వీరుడు రాహుల్ 2 పరుగులకే అవుటయ్యి నిరాశపరిచాడు. మురళి విజయ్, అజింక్య రహానే క్రీజ్ లో ఉన్నారు. ఇంకా రెండు రోజుల ఆట ఉండటంతో రేపు రెండో సెషన్స్ వరకు ఆడి భారీ టార్గెట్ ను లంక ముందు ఉంచాల్సి ఉంటుంది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ