భారత జట్టుకు అత్యుత్తమ భాగస్వామ్యాలతోపాటు మ్యాచ్ విన్నర్ లుగా నిలిచిన పెయిర్ ఏదంటే టక్కున చెప్పే పేరు ధోనీ-రైనాలు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్కు లభించిన అత్యుత్తమ ఫినిషర్ ధోనీ అయితే అతనికి అండగా నిలిచి కడదాకా పోరాడే అతడి జోడి సురేష్ రైనా. ఇప్పుడు వీరిద్దరు సఫారీల పోరు కోసం మరోసారి సిద్ధమైపోతున్నారు. కానీ... మూడు నెలలుగా రైనా మ్యాచ్ లకు దూరమయ్యాడు. చివరిసారిగా అతను ఆడిన బంగ్లా సిరీస్ లో కూడా ఫెర్ఫార్మెన్స్ పూర్. దీంతో ఆ టైంలో ధోనీని నాలుగో స్థానంలో దించారు. అప్పుడు వీరిద్దరి పార్టనర్ షిప్ కి ఆస్కారం లేకపోయింది. అయితే తర్వాత జరిగే దక్షిణాఫ్రికా సిరీస్ లో ధోనిని 4వ స్థానంలో కొనసాగించాలని నిర్ణయించారు. అంతకు ముందు రైనాను 2 లేదా 3 స్థానాల్లో పంపారు. ఇప్పుడు అదే కొనసాగించాలని టీం భావిస్తుందట. అయితే రైనా తనను మాత్రం 5, 6 స్థానాల్లో పంపాలని పట్టుబడుతున్నాడట. ధోనీ ప్లేస్ ను తాను తీసుకుని మ్యాచ్ ఫినిషర్ పాత్రను తాను పోషిస్తానని చెబుతున్నాడు. తనకు దొరికిన ఈ విశ్రాంతి పూర్తి ఫామ్ ను అందుకోడానికి బాగా సహకరించిందని అంటున్నాడు. ది బెస్ట్ పెయిర్ గా ఉన్న రికార్డులు ఏపాటివో మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వారి ప్లేస్ మెంట్ లను మార్చొద్దని సీనియర్లు టీం మేనేజర్ శాస్త్రిని కోరుతున్నారు.