మొహాలీ టెస్ట్ ఫలితం ఖాయమనుకున్నారు గానీ మరి ఇంత త్వరగానా అని ఏ అభిమాని ఊహించి ఉండడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారి భారత్ జయకేతనం ఎగరవేసింది. రవీంద్రజడేజా 5 వికెట్లతో, అశ్విన్ 3 విజృంభించటంతో మొదటి టెస్ట్ భారత్ కైవసం అయ్యింది. స్టియన్ వన్ (36) మినహా మిగతా వారెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు.
మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 201 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 200 సాధించగా, సౌతాఫ్రికా 184, 109 పరుగులు సాధించింది. దీంతో ఇండియా 108 పరుగుల తేడాతో విజయం సాధించినట్లయ్యింది. ఈ ఒక్కరోజే 18 వికెట్లు రాలటంతో ఇక పిచ్ పై విమర్శలు రావటం ఖాయమని తెలుస్తోంది.