బ్యాటింగ్ చేస్తున్న భారత్... ధవన్ డకౌట్

November 05, 2015 | 10:30 AM | 1 Views
ప్రింట్ కామెంట్
dhawan-early-dismiss-vijay-pujara-rebuild-innings-niharonline

ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా సఫారీలతో టెస్టు సమరం మొదలయింది. మొహాలీ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల కాసేపటి క్రితం తొలి టెస్టు ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా టాస్ లో నెగ్గిన టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక బ్యాటింగ్ దిగిన భారత్ కు ఆదిలోనే ఎదేరు దెబ్బ తగిలింది. ధవన్ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఓపెనర్లుగా ధవన్, మురళీ విజయ్ బ్యాటింగ్ కు దిగగా,  ఫిలండర్ బౌలింగ్ లో ధవన్ ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం విజయ్ 21 పరుగులు, పుజారా 13 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ స్కోర్ 12 ఓవర్లకు 34 పరుగులు.  

ఇక ముందుగా టాస్ గెలిచి పర్యాటక జట్టును ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు కెప్టెన్ కోహ్లీ. ఫ్రీడమ్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే టీ20, వన్డే టైటిళ్లను చేజార్చుకున్న టీమిండియా టెస్టు టైటిల్ ను అయినా దక్కించుకుని పరువు నిలుపుకోవాలని యత్నిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి జట్టు సొంత గడ్డపైనే రెండు టైటిళ్లను సులువుగా చేజిక్కించుకున్న సఫారీలు టెస్టు టైటిల్ ను కూడా సాధించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి టెస్టు రసవత్తరంగా కీలకం కానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ