రాయుడు ధాటికి రాయల్స్ విలవిల

May 02, 2015 | 11:35 AM | 125 Views
ప్రింట్ కామెంట్
rayudu_MI_rajasthan_royals_niharonline

అంబటి రాయుడి దెబ్బకు వరుస విజయాలతో ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్ కి పరాజయం తప్పలేదు. విజయం కోసం ముఖం వాచిపోయి ఉన్న ముంబై ఇండియన్స్ రాయుడు సూపర్ ఇన్నింగ్స్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. కేవలం 27 బంతుల్లోనే రాయుడు నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో చెలరేగి 53 పరుగులు సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవటంతో ముంబై ముందుగా బ్యాటింగ్ దిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసిది. తర్వాత బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు మాత్రమే కోల్పోయి 179 పరుగులే చేయగలిగింది. సంజూ శామ్ సన్ ఒక్కడే 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఒకానోక దశలో రాజస్థాన్ విజయం ఖాయమనుకున్నారు. కానీ , చివర్లో సంజూ ఔటయ్యాక చివరి దాకా ఉత్కంఠగా సాగింది. దీంతో ముంబై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ