ఐసీసీని శాసించేది ఆ మూడు దేశాలే!

April 09, 2015 | 02:04 PM | 64 Views
ప్రింట్ కామెంట్
Ehsan_Mani_ccomments_on_cricket_niharonline

క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన కలుగుతోందని ఐసీసీ మాజీ అధ్యక్షుడు ఎహసాన్ మణి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఐసీసీ ని శాసిస్తున్నాయని ఆయన ఆరోపించారు. క్రికెట్ లో ఆరోగ్యకరమైన వాతావరణం సన్నగిల్లుతోందని తెలిపారు. తదుపరి వరల్డ్ కప్ (2019) నాటికి పోటీల్లో పది జట్లే ఉంటాయన్న ఐసీసీ నిర్ణయంపై మణి తీవ్రంగా మండిపడ్డారు. పలు దేశాలు క్రికెట్ ఆడుతుంటే కేవలం 10 జట్లతోనే వరల్డ్ కప్ నిర్వహిస్తామనడం ఎంతవరకూ సరైన నిర్ణయమని ప్రశ్నించారు. క్రికెట్ వ్యాపారంగా మారిందని ఆయన అన్నారు. పలు దేశాల జట్టు ఆర్థికంగా తగిన బలంగా లేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ