రసవత్తరంగా సెమీస్... టార్గెట్ 329

March 26, 2015 | 01:04 PM | 35 Views
ప్రింట్ కామెంట్
India_australia_semi_final_niharonline

సిడ్నీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సెమీ ఫైనల్స్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. క్రమంగా తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ధాటిగా ఆడటంతో రన్ రేట్ ఏ క్షణంలో కూడా డౌన్ కాలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. దీంతో, ఫైనల్ లో అడుగుపెట్టాలంటే భారత్ 329 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. బలమైన బ్యాటింగ్ లైనప్ గల భారత్ కు ఇదేమంత పెద్ద లక్ష్యం కాదు. అయినప్పటికీ, ఒత్తిడి లోనుకాకుండా ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ