బంగ్లాపులులు భారీ తేడాతో గెలిచారు

February 18, 2015 | 05:01 PM | 32 Views
ప్రింట్ కామెంట్
bangladesh_afghanistan_match_niharonline

ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ పై 105 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా వికెట్ కీపర్ ముష్పికర్ రహీం (71), షకిబ్ ఆల్ హసన్ (63) లు రాణించటంతో నిర్ణిత 50 ఓవర్లలో 267 పరుగులు సాధించగలిగింది. ఇక 268 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘన్ కూనలు 42.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌట్ అయ్యారు. కెప్టెన్ మహ్మద్ నబీ(44) ఒక్కడే టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో మొర్తజా 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్ 2 వికెట్లు పడగొట్టారు. మరోపక్క మ్యాచ్ జరుగుతుండగానే ఆఫ్ఘనిస్తాన్ జట్టు మ్యాచ్ గెలిచిందని కాబూల్ లోని అమెరికా ఎంబసీ ట్వీట్ చేసింది. ఇది త్వరగా పాకి మీడియాకు చేరింది. దీంతో నాలుక కర్చుకున్న ఎంబసీ అధికారులు తిరిగి మరో ట్వీట్ చేశారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ