మీడియా సమావేశంలో మహీ ఏం మాట్లాడతాడో?

February 04, 2015 | 05:42 PM | 46 Views
ప్రింట్ కామెంట్

ప్రపంచకప్ సమరానికి కి ఇంకా పదిరోజులే సమయం ఉంది. టీమిండియా తరపు నుంచి వ్యూహా-ప్రతివ్యూహాల గురించిగానీ, ఆలోచనల మీద గానీ ఇప్పటివరకు ఎవరూ మీడియాతో మాట్లాడలేదు. సాధారణంగా టోర్నీకీ ముందు అన్ని జట్ల కెప్టెన్లు మీడియా సమావేశం నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 7న ఐసీసీ నిర్వహించబోయే మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాల్గొంటాడట. సిడ్నీలోని ఇంటర్నేషనల్ హాల్ లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ధోనీతోపాటు శిఖర్ ధావన్, సురేష్ రైనా, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మకూడా పాల్గొంటారని సమాచారం. టీమిండియా పరిణామాలపై ఇప్పటిదాకా నోరు విప్పని ధోనీ మరీ ఈ సమావేశంలో ఏంచెబుతాడన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ధోనీయే కాదు అదే రోజు మిగతా దేశాల కెప్టెన్లు కూడా విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తారని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ