క్లీన్ స్వీప్ తో దర్జాగా క్వార్టర్స్ లోకి కివీస్

March 13, 2015 | 04:52 PM | 39 Views
ప్రింట్ కామెంట్
newzeland_win_over_bangladesh_niharonline

ఆతిధ్య న్యూజిలాండ్ జట్టు వరల్డ్ కప్ లో గ్రూప్ దశను అజేయంగా ముగించింది. ఆడిన 6 మ్యాచ్ ల్లోనూ విజయభేరి మోగించి గ్రూప్-ఏ నుంచి టాపర్ గా నాకౌట్ దశకు చేరింది. శుక్రవారం హామిల్టన్ లోని సెడాన్ పార్క్ మైదానంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో కివీస్ జట్టు 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు సాధించింది. మహ్మదుల్లా (128) సెంచరీతో రాణించాడు. సౌమ్యా సర్కార్ 51, షబ్బీర్ రెహ్మన్ 40 పరుగులు సాధించారు. బౌల్ట్, కోరే ఆండర్సన్, ఇలియట్ తలో 2 వికెట్లు తీశారు. ఇక అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కివీస్ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 290 పరుగులు సాధించి విజయం సొంతం చేసుకుంది. ఓపెనర్ గుప్టిల్ 105 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రాస్ టేలర్ 56 పరుగులతో తోడ్పాటు అందించాడు. షకీబ్ అల్ హసన్ 4 వికెట్లు తీశాడు.  ఓ వైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరుతో విజయం అందించిన గుప్టిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ