స్వల్ఫ లక్ష్యంతో సరిపెట్టిన పాక్

March 20, 2015 | 01:26 PM | 48 Views
ప్రింట్ కామెంట్
Hazlewood_smash_pak_niharonline

ఆస్ట్రేలియా బౌలర్ల దెబ్బకి పాకిస్థాన్ స్వల్ఫ స్కోరుకే చాపచుటేసింది. శుక్రవారం అడిలైడ్ లో జరుగుతున్న  మూడో క్వార్టర్స్ మ్యాచ్ లో 49.5 ఓవర్లలో కేవలం 213 పరుగులు మాత్రమే సాధించి అలౌటయ్యింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ జట్టులో ఒక్క హారిస్ సొహైల్(41) తప్ప మిగతా వారెవరు రాణించలేకపోయారు. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో మిస్బా, హారిస్ లు కలిసి నాలుగో వికెట్ కు 79 పరుగులు జోడించారు. ఇక మిస్బా అవుటయ్యాక ఆస్ట్రేలియా బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీయటం ఆరంభించారు. టీంలో 8 మంది బ్యాట్స్ మెన్లు రెండంకెల స్కోర్ సాధించినప్పటికీ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయకపోవటం విశేషం. ఇక ఆసీస్ బౌలర్లలో హాజిల్ వుడ్ నాలుగు వికెట్లు తీసి రాణించగా, స్టార్క్, మాక్స్ వెల్ తల 2 వికెట్లు తీశారు. బౌలర్లు అద్భుతం చేస్తేనే సెమీస్ లో దాయాదిల పోరు వీక్షించే అవకాశం ఉంటుంది. తాజా సమాచారం ప్రకారం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 2 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 15 పరుగులు సాధించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ