చెమటోడ్చి నెగ్గిన జింబాబ్వే

February 19, 2015 | 12:27 PM | 27 Views
ప్రింట్ కామెంట్
zimbabwe_won_on_UAE_niharonline

భారీ టార్గెట్ ను తమ ముందుంచిన యూఏఈపై జింబాబ్వే పైచేయి సాధించింది. యూఏఈ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ చెమటోడ్చి పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. ప్రత్యర్థి నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని మరో 12 బంతులు మిగులుండగానే చేరుకుంది. జింబాబ్వే 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. విలియమ్స్ అజేయ అర్థ సెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. 65 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ తో 76 పరుగులు చేశాడు. చిగుంబుర 14 పరుగులు సాధించాడు. టేలర్ 47, రిగిస్ చకాబ్వా 35, రిగిస్ చకాబ్వా 46, ఎర్విన్ 32 పరుగులు చేసి విజయంలో భాగస్వాములయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. అర్థసెంచరీతో టీంను గెలిపించిన విలియమ్స్ కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ