ఆ రాజుగారి దూల 38 మందిని పొట్టనబెట్టుకుంది

August 31, 2015 | 04:12 PM | 2 Views
ప్రింట్ కామెంట్
reeddancers-kiiled-in-road-mishap-swaziland-niharonline.jpg

దాదాపు 1.4 మిలియన్ జనాభా ఉన్న ఆ దేశంలో ఓ దరిద్ర్యపు ఆచారం ఉంది. అమ్మాయిలు రాజు నగ్నంగా ముందు ఆడుతుంటే వారి అందాలను ఆయనగారు ఆస్వాదిస్తూ ఉంటాడు. అంతేనా వారిలో నచ్చని కన్యను తన రాణిగా ఎంచుకుంటాడు.  

ఆఫ్రికా ఖండంలోని స్వాజిలాండ్ అనే ఓ దేశంలో ఈ వింత ఆచారం ఉంది. 1986 నుంచి ఎంస్వతి రాజవంశం ఈ ప్రాంతాన్ని పాలిస్తుంది. అప్పటి నుంచి ఈ ఆచారం ఆనావాయితీగా వస్తుంది. ఏటా దాదాపు 40,000 మంది యువతులు ఈ ప్రదర్శనలో పాల్గొంటే ఏ ఏడు కాయేడు కొత్త రాణిని రాజుగారు ఎంచుకుంటారట. అయితే ఈ దఫా ప్రదర్శన కోసం వెళ్తున్న యువతులను మృత్యు ఒడిలోకి ఆహ్వానించింది. ఘోర రోడ్డు ప్రమాదంలో వారంతా మృతిచెందారు. దాదాపు 50 మందిలో ప్రయాణిస్తున్న ఓ టాప్ ట్రక్కు మార్గమధ్యంలో మరో వాహనాన్ని ఢీకోట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 మంది యువతులు అక్కడిక్కడే మృతిచెందారు. ఆ దేశ రాజు ఎంస్వతి-3 ముందు వారంతా ఆడిపాడేందుకు వెళ్తున్నారు. రాజు కొత్త భార్యను ఎంచుకునే ఈ సంప్రదాయం కొన్నేళ్లుగా అక్కడ ఉంది.

మొత్తానికి రాజుగారి సరదా కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. రాణి అవుదామనుకుని వెళ్లిన వారంతా కానరాని లోకాలకు చేరారన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ