భారత్ ఇచ్చే చాక్లెట్లు ఇకపై ఎవరూ తీసుకోరట

July 31, 2015 | 02:50 PM | 4 Views
ప్రింట్ కామెంట్
yakub_memon_chota_shakeel_dawood_niharonline

యాకుబ్ మెమన్ విషయంలో భారత్ చేసిందానికి ప్రతీకారం సాధించి తీరుతామని దావూద్ ఇబ్రహీం మాజీ అనుచరుడు చోటాషకీల్ ప్రకటించాడు. లొంగిపోయి విచారణకు సహకరిస్తే, ప్రాణాపాయం లేకుండా చూసి రక్షణ కల్పిస్తామని, జైలు శిక్ష నుంచి తప్పిస్తామని భారత ప్రభుత్వ అధికారులు నమ్మబలికారని. వారి మాటలు విన్న పాపానికి మెమన్ ఉరికంబం ఎక్కాడని షకీల్ వ్యాఖ్యానించాడు. రక్షణ కల్పిస్తామన్న భారత్ వెన్నుపోటు పొడిచిందని అన్నాడు. పేలుళ్ల తరువాత అప్పట్లో లొంగిపోతే సకల సౌకర్యాలు కల్పిస్తామని దావూద్ ఇబ్రహీంకు సైతం ఆశ పెట్టారని గుర్తుచేశారు. దావూద్ లొంగిపోయినా ఇదే గతి పట్టి ఉండేదని షకీల్ అభిప్రాయపడ్డాడు. అప్పట్లో లొంగుబాటు తరువాత నెలకొనే పరిణామాలపై ఉన్న అనుమానాలు ఇప్పుడు నిజమయ్యాయని అన్నాడు. ఇకపై ఎవ్వరూ భారత ప్రభుత్వం ఇస్తున్న 'చాక్లెట్'లను తీసుకోరని అన్నాడు. ఏ భారత ఏజన్సీ చేసే ఒట్లను నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, భారత ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఎవరూ నమ్మరని వివరించాడు.  టైగర్ మెమన్ పేరును చార్జ్ షీట్లో రాసిన భారత సర్కారు, ఆడియో, వీడియో సాక్ష్యాలను తెచ్చిచ్చిన మరో వ్యక్తిని బలిపశువును చేసిందని ఆరోపించాడు. కేవలం భారత ఏజన్సీల మాటలను నమ్మే యాకూబ్ ఇండియాకు తిరిగొచ్చాడని చెప్పాడు. దావూద్ తో యాకూబ్ కు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశాడు. ఈ ఉరికి దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ప్రతీకారం తీర్చుకునే అవకాశాలున్నాయని షకీల్ చెప్పాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ