ఏంటీ... రాజపక్సే ఒటమికి ‘రా’ కారణమా?

January 18, 2015 | 08:32 PM | 39 Views
ప్రింట్ కామెంట్

శ్రీలంకలో మహింద్ర రాజపక్సే పాలన ముగియడానికి కారణం భారత్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్(రా) అని లంక మీడియా బలంగా నమ్ముతుంది. మైత్రిపాల సిరిసేనకు భారత్ మద్ధతు ప్రకటించి, ఆయన గెలుపునకు వెనకుండి మంత్రాంగం నడిపించిందని లంక పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. అందుకు రా తోడ్పుతుందని పేర్కొన్నాయి. కాగా, ఈ విషయాన్ని రాజపక్సే ముందే గమనించినట్టు తెలుస్తోంది. అందువల్లే కొలంబోలో పనిచేస్తున్న రా స్టేషన్ చీఫ్ ను ఎన్నికలకు ముందే దేశం విడిచి వెళ్లాలని ఆయన ఆదేశించారట. ఈ విషయంలో అటు లంకగానీ, ఇటు భారత్ గానీ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ