పెన్ను పోయి గన్ను వచ్చే ఢాం... ఢాం... ఢాం...

January 28, 2015 | 01:31 PM | 21 Views
ప్రింట్ కామెంట్

చేతిలో పుస్తకాలు పట్టి పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన టీచర్లు గనులు పడితే ఎలా ఉంటుంది. పాకిస్థాన్ లో ఇప్పుడు అదే సీన్ దర్శనమిస్తోంది. పాక్ వాయవ్య ప్రాంతంలో పనిచేస్తున్న టీచర్లకు ఇప్పుడు ఆయుధ శిక్షణ ఇస్తున్నారు. ఫెషావర్ సైనిక పాఠశాలపై తాలిబన్లు దాడిచేసి కర్కశంగా వందకు పైగా విద్యార్థులను పోట్టనబెట్టుకున్న నేపథ్యంలో అక్కడి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆత్మరక్షణలో భాగంగా శిక్షణ ఇస్తున్నామని, టీచర్లు పాఠశాలకు ఆయుధాలు తెచ్చుకుంటామంటే అభ్యంతరపెట్టబోమని ఖైబర్ ఫక్తుంక్వా ప్రావిన్స్ విద్యా శాఖ మంత్రి అతీఫ్ ఖాన్ పేర్కొన్నారు. ఇక, సమాచార శాఖ మంత్రి ముస్తాక్ గని మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహించే ప్రతిపాఠశాలకు సాయుధ పోలీసులను రక్షణగా నియమించలేమని, అందుకే టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. అధికార వర్గాలు వారం నుంచే టీచర్లకు తుపాకీ వినియోగంపై శిక్షణ ఇస్తువస్తున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ