భూమి వైపు దూసుకొస్తున్న అంతరిక్ష శకలం

October 27, 2015 | 01:52 PM | 3 Views
ప్రింట్ కామెంట్
NASA-asteroid-close-to-earth-niharonline

గుర్తు తెలియని వస్తువు ఒకటి భూమి వైపుగా దూసుకువస్తుంది. మరో 15 రోజుల్లో అంటే నవంబర్ 13న ఇది భూమీని తాకనున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. 'స్పేస్ జంక్' (అంతరిక్షంలో వృథాగా పరిభ్రమించేవి) భూమి వైపు వేగంగా దూసుకొస్తుందని నాసా సైటింస్టులు తెలిపారు.  అయితే అది ఏమిటన్న విషయం వారికి కూడా స్పష్టంగా తెలియదట. దానికి 'డబ్ల్యూటీఎఫ్' అని పేరు పెట్టామని వెల్లడించిన సైంటిస్టులు, శ్రీలంక తీరానికి 40 కిలోమీటర్ల దూరంలోని హిందూ మహా సముద్రంలో ఉదయం 6:15 గంటల సమయంలో ఇది కూలుతుందని వివరించారు.

 "అంతరిక్ష చరిత్రలో ఉనికిని పోగోట్టుకున్న ఓ వస్తువేదో మనల్ని వెంటాడుతూ వస్తోంది" అని హార్వార్డ్ -స్మిత్ సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్త జొనాథన్ మెక్ డొవెల్ వెల్లడించారు. దీన్ని ఆరిజోనా వర్శిటీలోని కాటలినా స్కై సర్వే సెంటర్ తొలిసారి గుర్తించిందని తెలిపారు. ఇది భూమి వాతావరణంలోకి రాగానే మండిపోతుందని, కాబట్టి మానవాళికి ప్రమాదం ఉండదని అన్నారు. ఈ తరహా అంతరిక్ష వ్యర్థాలు సుమారు 5 లక్షలకు పైగానే భూమికి సమీపంలో తిరుగుతున్నట్లు నాసా తెలిపింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ