హైడ్రోజన్ బాంబుతో కృత్రిమ భూకంపం

January 06, 2016 | 11:22 AM | 1 Views
ప్రింట్ కామెంట్
North-Korea-conducted-hydrogen-bomb-test

ఉత్తర కొరియాలో బుధవారం ఉదయం సంభవించిన భూప్రకంపనలకు కారణం తెలిసిపోయింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై దాదాపు 5.1 తీవ్రతతో భూమి కంపించింది. అయితే అది భూకంపం కాదని, అణ్వస్త్ర పరీక్షేనని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించేసింది. అంతకుముందు.. అందరూ ఉత్తరకొరియాలో సంభవించింది భూకంపమా.. కృత్రిమ భూకంపమా లేదా అణ్వస్త్ర పరీక్షా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా దీనిపై పెద్దస్థాయిలో చర్చ మొదలవ్వడంతో.. చివరకు ఉత్తరకొరియానే అధికారికంగా అసలు విషయాన్ని ప్రకటించింది. ఇటీవలి కాలంలోఅమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా.. ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఆందోళన కలిగిస్తోంది. ఇంతవరకు హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే మొదటిసారి.

                          2013లో ఈశాన్య కొరియా ప్రాంతంలో భూగర్భంలో అణు పరీక్షలు నిర్వహించారు. ఇప్పుడు అదే స్థలంలో కృత్రిమ భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తరకొరియాలో సంభవించినది భారీ పేలుడు కావచ్చని చైనా భూకంప గుర్తింపు కేంద్రాలు అనుమానిస్తున్నాయి. అది కృత్రిమ భూకంపం అని దక్షిణ కొరియా వాతావరణ శాఖ తెలిపింది. తమవద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని తెలుస్తోంది. పరిణామాలను చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చే అవకాశం లేకపోలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ